గుంటూరు నగరంలో యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - May 23 , 2024 | 01:09 AM
గుంటూరు నగరంలోని అరండల్ పేట పోలీస్ ేస్టషన్ పరిధిలోని సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం కంచర్ల దేవానందం అలియాస్ దేవా (33) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
![గుంటూరు నగరంలో యువకుడి దారుణ హత్య](https://media.andhrajyothy.com/media/2024/20240511/RR_88532c6569.jpg)
గుంటూరు, మే 22 : గుంటూరు నగరంలోని అరండల్ పేట పోలీస్ ేస్టషన్ పరిధిలోని సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం కంచర్ల దేవానందం అలియాస్ దేవా (33) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలోనే ఈహత్య జరిగి ఉంటుందని పోలీ సులు అనుమానిస్తున్నారు. దేవా స్నేహితులైన అదే ప్రాంతానికి చెందిన పల్లె రాజు, చిలక రాజు అనే ఇద్దరు కత్తులతో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్యకు దేవా మేనమామ జ్యోతిరాజు పైన అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి. సమాచారం అందుకున్న వెస్ట్ డీఎస్పీ మహేష్, అరండల్ పేట సీఐ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు..
గతంలో సంజీవయ్యనగర్ 1వ లైన్కి చెందిన దేవా కొంత కాలం వలంటీర్గా పని చేశాడు. భార్యతో మనస్పర్థలు రావడంతో ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. అనంతరం విశాఖపట్నం ఉంటున్న దేవా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతకాలం క్రితం నగరానికి వచ్చి నగరాలులో నివాసం ఉంటు న్నాడు. దేవా రియల్ఎేస్టట్ వ్యాపారం లోకి దిగాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా దేవాకు హౌసింగ్ బోర్డుకాలనీలో ఉంటూ, నల్లపాడులోని పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేసే తన మేనమామ జ్యోతి రాజుకు రూ.15 లక్షల వరకు బకాయిపడ్డాడు. ఆమొత్తం చెల్లించాలంటూ జ్యోతిరాజు కొంత కాలంగా దేవాపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో జ్యోతి రాజు 15 రోజుల క్రితం దేవాను చంపుతానని బెదిరించాడు. జ్యోతిరాజు తనకు సొంత మేనమామ కావడంతో ఆయన హెచ్చరికలను దేవా తేలిగ్గా తీసుకున్నాడు. ఇదిలా ఉండగా రెండు రోజులుగా దేవా తన ేస్నహితులైన సంజీవయ్య నగర్కు చెందిన పల్లె రాజు, చిలక రాజులతో కలిసి మద్యం తాగుతూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం దేవ తన కారులో వసంత రాయపురం మెయిన్ రోడ్డులోని బార్కు తన ఇద్దరు ేస్నహితులు పల్లె రాజు, చిలక రాజులను తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురు కలసి మద్యం తాగారు. అనంతరం ఇంటికి వచ్చేందుకు బయలుదేరారు. మధ్యా హ్నం సుమారు 12: 45 గంటల సమయంలో కారు సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్డు వద్దకు రాగానే కారులోవున్న ఇద్దరు ేస్నహితులు కత్తులతో దేవాపై దాడి చేశారు. ఈ ఘటనతో తేరుకున్న దేవా తప్పించుకునేందుకు కారు దిగి పారిపోతుండగా వెంటపడి కత్తులతో పొడిచి హత్యచేసి పరారయ్యారు.
దేవా స్నేహితులే నిందితులు కావటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులతో దేవాకు ప్రత్యక్షంగా ఏ వివాదాలు, గొడవలు లేవని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే తనకు రావలసిన బకాయి విషయంలో మేనమామ జ్యోతిరాజు చంపుతానని దేవాను హెచ్చరించినట్లు హతుని సోదరుడు తెలిపాడు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఇద్దరు నిందితులతో పాటు పోలీసులు అనుమానిస్తున్న జ్యోతిరాజు పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు అనుమానాలకు మరింత బలం చేకూరినట్లు అయింది. కాగా నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు రంగంలో దిగి గాలింపు ప్రారంభించాయి.