ఎన్నికల ఘర్షణల్లో పలువురిపై కేసులు
ABN , Publish Date - May 19 , 2024 | 01:03 AM
మండలంలోని చింతపల్లి, కొత్తపల్లి, వేల్పూరు గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలో ఐదు కేసులు నమోదైనట్టు సీఐ ఎస్కే కరీముల్లా షావలి శనివారం తెలిపారు.
![ఎన్నికల ఘర్షణల్లో పలువురిపై కేసులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అచ్చంపేట, మే 18 : మండలంలోని చింతపల్లి, కొత్తపల్లి, వేల్పూరు గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలో ఐదు కేసులు నమోదైనట్టు సీఐ ఎస్కే కరీముల్లా షావలి శనివారం తెలిపారు. కొత్తపల్లిలో వైసీపీకి చెందిన చిలకా యాకోబు ఫిర్యాదు మేరకు రంగిశెట్టి నరసింహారావు, కూకట్లపల్లి అయ్యపరాజు, మరో తొమ్మిది మంది టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైం ది. ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన రంగిశెట్టి నవీన్ ఫిర్యాదు మేరకు తేళ్ళూరి వెంకట రామిరెడ్డి, మార్కపూడి దేవదానం, మరో ఐదుగురు వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. వేల్పూరులో వైసీపీకి చెందిన సందెపోగు మాణిక్యం ఫిర్యాదు మేరకు పొన్నెకంటి వంశీ, పొన్నెకంటి శివ నాగమల్లేశ్వరరావు, మరో ఆరుగురు టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా చింతపల్లిలో వైసీపీకి చెందిన చిలకా పెద ఇస్సాక్ ఫిర్యాదు మేరకు బత్తుల శ్రీని వాసరావు, బత్తుల వెంకటేశ్వర్లు, మరో నలుగురు టీడీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పేరుబోయిన పుల్లారావు ఫిర్యాదు మేరకు చిలకా పెద ఇస్సాక్, కొంపెర్ల రోశయ్య, మరో ఐదుగురిపై కేసులు నమోదైనట్టు సీఐ తెలిపారు.