Share News

అధ్వాన రోడ్లతో ప్రజలకు అవస్థలు

ABN , Publish Date - May 24 , 2024 | 01:00 AM

మండలంలోని పేరూరుపాడు, సరికొండపాలెం, పలుకూరు గ్రామాల రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఏళ్ళ తరబడి మరమ్మతులకు నోచుకోకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

అధ్వాన రోడ్లతో  ప్రజలకు అవస్థలు
అధ్వానంగా ఉన్న పేరూరుపాడు రోడ్డు

- ఏళ్ళ తరబడి మరమ్మతులు నిల్‌

- గుంతలతో తరచూ ప్రమాదాలు

- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

బొల్లాపల్లి, మే 23: మండలంలోని పేరూరుపాడు, సరికొండపాలెం, పలుకూరు గ్రామాల రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఏళ్ళ తరబడి మరమ్మతులకు నోచుకోకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వెల్లటూరు నుంచి పేరూరుపాడుకు వెళ్ళేందుకు మూడు కిలోమీటర్ల రోడ్డుకు గంట ప్రయాణం చేయాల్సివస్తోంది. రోడ్డు అధ్వానంగా మారి పలుమార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. కనమలచెరువు నుంచి పలుకూరు వెళ్ళేందుకు కనమలచెరువు, మూడు తూముల తండా, గాడి తండా, స్వాములవాగు తండా, రామాపురం, పలుకూరు గ్రామాలకు రోడ్లు సరిగా లేక గుంతల మయంగా మారటంతో గాడితండా సమీపంలోని ఎనఎ్‌సపీ మెయిన కెనాల్‌ మీదుగా బ్రిడ్జి తండాకు చేరుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తోంది. అలాగే సరికొండపాలెం తండా నుంచి సరికొండపాలెం, వడ్డెంగుంట రహదారి మరీ అధ్వానంగా తయారైంది. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లోని అంతర్గత రోడ్లను మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 24 , 2024 | 01:00 AM