Share News

AP Politics: ఎంపీ లావు బాటలో మరికొంత మంది వైసీపీ కీలక నేతలు

ABN , Publish Date - Jan 23 , 2024 | 01:51 PM

ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు నేడు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లావు శ్రీ కృష్ణ దేవరాయులు బాటలోనే మరికొంత మంది పల్నాడు వైసీపీ కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

AP Politics: ఎంపీ లావు బాటలో మరికొంత మంది వైసీపీ కీలక నేతలు

గుంటూరు: ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు నేడు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లావు శ్రీ కృష్ణ దేవరాయులు బాటలోనే మరికొంత మంది పల్నాడు వైసీపీ కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు పార్టీకి రాజీనామా చేయనున్నారట. అలాగే లావు శ్రీ కృష్ణ దేవరాయులు వెంట గుంటూరుకు చెందిన వైసీపీ ముస్లిం కీలక నేత ఒకరు.. పల్నాడు జిల్లాకి చెందిన ఓ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ కూడా పార్టీ వీడతారని ప్రచారం జరుగుతోంది.

Updated Date - Jan 23 , 2024 | 02:19 PM