Share News

AP Election 2024: వైసీపీ గ్రూపుల్లో పేర్ని నాని ఆడియో టేప్ లీక్

ABN , Publish Date - Apr 02 , 2024 | 08:35 PM

వలంటీర్ల ద్వారా పెన్షన్ నగదుని పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వైసీపీ తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తోంది. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. తమదారి తమ అన్నట్టుగా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు.

AP Election 2024: వైసీపీ గ్రూపుల్లో పేర్ని నాని ఆడియో టేప్ లీక్

మచిలీపట్నం: మరో నెలన్నర రోజుల్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనే అత్యాశతో అధికార వైసీపీ వీలైనన్ని కుయుక్తులు పన్నుతోన్న విషయం తెలిసిందే. అధికార వ్యవస్థలను ఉపయోగించుకొని లబ్ది పొందాలని చూస్తోంది. ముఖ్యంగా వలంటీర్ వ్యవస్థ లేకపోతే ఏదో జరిగిపోతుందని, వైసీపీ అధికారంలోకి రాకపోతే ఈ వ్యవస్థ ఉండబోదని ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా వలంటీర్ల ద్వారా పెన్షన్ నగదుని పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కుటిల బుద్ధిని ప్రదర్శిస్తోంది. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. తమదారి తమ అన్నట్టుగా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు.

ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాజీనామా చేసిన వలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇప్పించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలకు బందరు ఎమ్మెల్యే పేర్ని నాని ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పేర్ని నాని ఆడియో టేప్ వైసీపీ గ్రూపుల్లో లీక్ అయ్యింది. ఆటోలు పెట్టి పెన్షనర్లను సచివాలయాలకు తీసుకువెళ్లాలని, ఆటో ఖర్చులన్నీ తర్వాత ‘మనం మనం చూసుకుందాం..’ అంటూ వైసీపీ నేతలకు సూచించారు. ‘పెన్షన్ ఇప్పించిన తర్వాత మళ్లీ వాళ్లను వారి ఇంటి దగ్గర దింపే బాధ్యత కూడా మీదే’ అంటూ ఆడియో టేప్‌లో ఆయన హుకుం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

YSR Congress: వైసీపీకి మరిన్ని ఝలక్‌లు.. టీడీపీలోకి వలసలు

AP Election 2024: చంద్రబాబును కలిసిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 08:37 PM