Share News

AP Election 2024: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:19 PM

విశాఖపట్నం నార్త్ నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు.

AP Election 2024: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు

విశాఖపట్నం నార్త్ నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు ప్లాన్ చేశారని అన్నారు. ఈ మేరకు విశాఖ సీపీకి ఆయన ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయాన్ని పోలీసులకే కాకుండా ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లవొచ్చునని తెలుస్తోంది. కాగా ఫిర్యాదుకు సంబంధించి ఏయే అంశాలను పొందుపరిచారు, ఎవరి పేర్లనైనా ప్రత్యేకంగా పేర్కొన్నారా వంటి విషయాలు తెలియాల్సి ఉంది.

కాగా జేడీ లక్ష్మీ నారాయణ ప్రతి రోజూ ప్రచారం చేయనున్న నేపథ్యంలో పోలీసులు సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Apr 26 , 2024 | 06:32 PM