Share News

AP: వైసీపీ నేతల ప్రలోభాలు షురూ.. గోదాంలో భారీగా దుస్తులు లభ్యం.. విస్తుపోయిన ఈసీ అధికారులు

ABN , Publish Date - Mar 27 , 2024 | 06:48 PM

ఎన్నికలకు మరి కొన్ని వారాలు ఉండగానే ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార వైసీపీ కుట్రలు పన్నుతోంది. ఓటర్లను మభ్యపెట్టేందుకు బహుమతులను రెడీ చేసుకుంటోంది. అన్ని నియోజకవర్గా్ల్లో గోదాంలలో వేల సంఖ్యలో చీరలు, ప్యాంట్లు ఇతర విలువైన సామగ్రిని ఇప్పటికే తెచ్చి ఉంచింది.

AP: వైసీపీ  నేతల ప్రలోభాలు షురూ.. గోదాంలో భారీగా దుస్తులు లభ్యం.. విస్తుపోయిన ఈసీ అధికారులు

ప్రకాశం: ఎన్నికలకు మరి కొన్ని వారాలు ఉండగానే ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార వైసీపీ కుట్రలు పన్నుతోంది. ఓటర్లను మభ్యపెట్టేందుకు బహుమతులను రెడీ చేసుకుంటోంది. అన్ని నియోజకవర్గా్ల్లో గోదాంలలో వేల సంఖ్యలో చీరలు, ప్యాంట్లు ఇతర విలువైన సామగ్రిని ఇప్పటికే తెచ్చి ఉంచింది. ఈసీ అధికారులు ఓ చోట సోదా నిర్వహించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

ఒంగోలు మండలం గుత్తిగుండవారిపాలెంలోని ఓ గోదాంలో పెద్ద ఎత్తున చీరలు, ప్యాంట్లు, షర్ట్‌లు తదితర విలువైన సామగ్రిని అధికార వైసీపీ నేతలు నిల్వ చేశారు. టీడీపీ కార్యకర్తల సమాచారంతో గోదాంలో ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. గోదాం తెరిచి చూసిన అధికారులు షాక్ అయ్యారు. ధాన్యం నిల్వ ఉండాల్సిన ప్రాంతంలో ఓటర్లకు గాలం వేయడానికి వెయ్యికి పైగా దుస్తులు, వస్తువులు నిల్వ చేయడాన్ని గుర్తించారు.

ఒంగోలులో డ్వాక్రా మహిళలు, ఇళ్ళ పట్టాల లబ్ధిదారులకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల వస్త్రాలు పంపిణీ చేశారు. మిగితా దుస్తులను వైసీపీ నేతలు గోదాంలో దాచి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం కావడంతో వాటితో ఓటర్లను ప్రలోభ పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని వైసీపీ కుట్ర పన్నినట్లు టీడీపీ ఆరోపిస్తోంది.

Chandrababu: జబర్దస్త్ ఎమ్మెల్యే చేసిందేమీ లేదు.. మంత్రి రోజాపై చంద్రబాబు విసుర్లు

Updated Date - Mar 27 , 2024 | 06:49 PM