రేపు కాకినాడలో షర్మిల రోడ్షో
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:34 AM
ఈనెల 29న కాకినాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోడ్షో నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం విశాఖ నుంచి రోడ్ మార్గం గుండా బయలుదేరి ఉదయం 11 గంటలకు స్థానిక అచ్చంపేట సెంటర్కు చేరుకుంటారు అక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు వెంట రాగా సర్పవరం సెంటర్, భానుగుడి జంక్షన్, మెయిన్రోడ్, జగన్నాథపురం వంతెన, ఎంఎస్ఎన్ చార్టీస్ మీదుగా యానాం రోడ్లోని బాలయోగి విగ్రహం వరకు రోడ్షో జరపనున్నారు.
కాకినాడ సిటీ, ఏప్రిల్ 27: ఈనెల 29న కాకినాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోడ్షో నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం విశాఖ నుంచి రోడ్ మార్గం గుండా బయలుదేరి ఉదయం 11 గంటలకు స్థానిక అచ్చంపేట సెంటర్కు చేరుకుంటారు అక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు వెంట రాగా సర్పవరం సెంటర్, భానుగుడి జంక్షన్, మెయిన్రోడ్, జగన్నాథపురం వంతెన, ఎంఎస్ఎన్ చార్టీస్ మీదుగా యానాం రోడ్లోని బాలయోగి విగ్రహం వరకు రోడ్షో జరపనున్నారు. అనుమతులను బట్టి స్థానిక భానుగుడి జంక్షన్ వద్ద గానీ, జగన్నాథపురం వంతెన వద్ద గానీ ప్రత్యేక వాహనంపై నుంచి షర్మిల ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రోడ్ షో ముగించుకుని అక్కడి నుంచి రోడ్ మార్గం గుండా అమలాపురం, గన్నవరం చేరుకుని ప్రచార కార్యక్రమాల్లో సాయంత్రం 4 గంటల సమయంలో పోలవరం బయలుదేరి వెళ్తారు. ఈ రోడ్ షోలో పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజులతో పాటు కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు, ఏఐసీసీ సభ్యుడు మల్లిపూడి రాంబాబు, కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుకోటి పాండురంగారావు పాల్గొననున్నారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు పాండు రంగారావు మీడియాతో మాట్లాడుతూ 29న కాకినాడలో జరుగనున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోడ్ షోలో పార్టీ నేతలు, అసెంబ్లీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయా లని కోరారు.