వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఏడిద వాసులు
ABN , Publish Date - Jan 10 , 2024 | 01:46 AM
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఏడిద వాసులు
మండపేట, జనవరి 9: ఏడిదకు చెందిన వైసీపీ శ్రేణులు మంగళవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అమలాపురం టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జి గంటి హరీష్మాధుర్ సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, అందుకే వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు వారు తెలిపారు. వైసీపీ శ్రేణులు పైడిమల్ల లచ్చయ్య, లంక చిన్న, బొడ్డపాటి వినోద్కుమార్, నాగు, సునీల్కుమార్, వేమగిరి చాచా, పలివెల నాని టీడీపీలో చేరారు. వారికి హరీష్, వేగుళ్ల పార్టీ కండువాలు వేసి సాద రంగా ఆహ్వానించారు. పార్టీ కార్యక్రమంలో స్థానిక నేతలు కోలుపోటి బాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి వాద ప్రసాదరావు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.