వైసీపీలో చేరిన రోజే మాజీ మేయర్కు చుక్కెదురు
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:16 AM
కార్పొరేషన్ (కాకినాడ), ఏప్రిల్ 19: ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజకు వైసీపీలో చేరిన తొలిరోజే చుక్కెదురైంది. రాజానగరం ఎస్టీ రాజాపురం నైట్స్టే పాయింట్ వద్ద జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, మంత్రి చెల్లుబోయిన
కార్పొరేషన్ (కాకినాడ), ఏప్రిల్ 19: ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజకు వైసీపీలో చేరిన తొలిరోజే చుక్కెదురైంది. రాజానగరం ఎస్టీ రాజాపురం నైట్స్టే పాయింట్ వద్ద జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సమక్షంలో వైసీపీలో చేరిన సరోజకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సాయంత్రం అచ్చంపేట జంక్షన్లో జరిగిన జగన్ సిద్ధం సభకు వెళ్లిన ఆమెను భద్రతా సిబ్బంది సభా ప్రాంగణంలోకి అనుమతించలేదు. ముందుగా సిబ్బందికి ఇచ్చిన వీఐపీ జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో కాసేపు బయట బారికేడ్ల వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈలోగా పార్టీనేతలు చేరుకుని ఆమెను సభా ప్రాంగణంలోకి తీసుకెళ్లారు.