Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి 200 మంది చేరిక

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:41 PM

రౌతులపూడి, మార్చి 18: మండలంలో ఎన్‌ఎన్‌పట్నం గ్రామానికి చెందిన 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌ లాలం అప్పలనాయుడు సమ క్షంలో టీడీపీలోకి చేరగా వారికి జనసేన-టీడీపీ- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వరుపుల సత్యప్రభ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. అ

వైసీపీ నుంచి టీడీపీలోకి 200 మంది చేరిక
టీడీపీలో చేరిన కార్యకర్తలతో సత్యప్రభ

రౌతులపూడి, మార్చి 18: మండలంలో ఎన్‌ఎన్‌పట్నం గ్రామానికి చెందిన 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌ లాలం అప్పలనాయుడు సమ క్షంలో టీడీపీలోకి చేరగా వారికి జనసేన-టీడీపీ- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వరుపుల సత్యప్రభ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. అనం తరం ఎన్‌ఎన్‌పట్నం, వెంటనగరం, ఈనం గ్రా మాల్లో మీ ఇంటికి- మీ రాజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అమలు చేసే సంక్షేమ పథకాలను వివరించారు. ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మి, టీడీపీ మం డలాధ్యక్షుడు తమారల సత్యనారాయణ, అల్లం బాబు, రమణ, ఈగల సత్తిబాబు పాల్గొన్నారు.

యనమల దివ్య సమక్షంలో...

తుని రూరల్‌: తుని టీడీపీ,జనసే, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య సమక్షంలో తుని మండలానికి చెందిన పలువురు యువకులు డి.పోలవరానికి చెందిన పలకా సోమేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి దివ్య పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారు మాట్లాడుతూ మా తొలి ఓటుతో టీ డీపీ జెండాను ఎగరవేస్తామన్నారు. గొప్ప విజన్‌ ఉన్న చంద్రబాబు, పవన్‌ నాయకత్వంలోనే యు వతకు ఉజ్వల భవిష్యత్తు అని దివ్య తెలిపారు.

Updated Date - Mar 18 , 2024 | 11:41 PM