జగ్గంపేట వైసీపీలో ఆధిపత్య పోరు
ABN , Publish Date - Jan 17 , 2024 | 12:30 AM
గోకవరం వైసీపీలో ఆధిపత్యపోరు అక్కడ ఎస్ఐ బదిలీ అవ్వడానికి దారి తీసింది.
రాజమహేంద్రవరం, జనవరి16(ఆంధ్రజ్యోతి) : గోకవరం వైసీపీలో ఆధిపత్యపోరు అక్కడ ఎస్ఐ బదిలీ అవ్వడానికి దారి తీసింది. ఇటీవల కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబును పక్కన పెట్టి ఆ నియోజకవర్గానికి మాజీ మంత్రి తోట నరసింహంను ఇన్చార్జిగా నియ మించిన సంగతి తెలి సిందే.దీంతో ఆయన వర్గానికి చెందిన ఓ దళిత నేతను గతంలో ఎస్ఐ కాస్త ఇబ్బంది పెట్టారనే కారణంతో పండగ ముందు ఆకస్మికంగా బదిలీ చేయించినట్టు తెలిసింది. ఇక్కడ ఎస్ఐ యూవీ.శివనాగబాబు గతంలో ఎమ్మెల్యే చంటిబాబుకు అనుకూలంగా వ్యవహరించినట్టు సమాచారం. ఇవాళ వ్యతిరేకవర్గానికి పెత్తనం రావ డంతో ఈ పరిణామం సంభవించింది. దీంతో నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇంతవరకూ తమ చేతిలో ఆధిపత్యం ఉందని విర్రవీగిన వాళ్లకు, ఇవాళ మరొకరి చేతిలోకి వెళ్లడంతో ఇబ్బందిగా ఉన్నారు. వైసీపీనీ వీడిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కొత్తగా కె.నాగరాజు ఎస్ఐగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు.