అవినీతి వైసీపీని గద్దె దింపాలి: ఎమ్మెల్యే వేగుళ్ల
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:53 AM
వైసీపీ పాలనలో రాష్ట్రంలో అవి నీతి రాజ్యమేలుతోందని, అవినీతిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పిలుపునిచ్చారు.
రాయవరం, ఏప్రిల్ 26: వైసీపీ పాలనలో రాష్ట్రంలో అవి నీతి రాజ్యమేలుతోందని, అవినీతిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం చెల్లూరు, కూర్మాపురం, వెంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యేకు మహిళలు హారతులు ఇచ్చి, బొట్టుపెట్టి ఆశీర్వదించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పూలమాలలువేసి ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఐదేళ్లలో వెనక్కి వెళ్లిందని, కొత్త పరిశ్రమలు లేక ఉపాధిలేకయువత ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో భూమి, ఇసుక, లిక్కర్ మాఫియా ద్వారా రూ.వేలకోట్లు దోచుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గంటి హరీష్ మాధుర్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వేగుళ్ల కోరారు.