టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:22 AM
టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడు ప్రకటించారు. టీడీపీ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
తుని రూరల్, ఏప్రిల్ 26: టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడు ప్రకటించారు. టీడీపీ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఆయనతో పాటు కాకినాడ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్, సీనియర్ నేత పోల్నాటి శేషగిరిరావు, అనుచరగణం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా తన అన్న యనమల రామకృష్ణుడుకు, టీడీపీకి నమ్మకంగా పనిచేశానని, రామకృష్ణుడు 6 సార్లు గెలవడానికి తాను కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. 2014,2019లో పోటీ చేసి ఓటమి పాలయ్యానని తాను నెగ్గే తరుణంలో యనమల రామకృష్ణుడు తన కుమార్తెకు సీటు ఇప్పించుకున్నారన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేసినా తమకు గౌరవం లేదని, నియోజకవర్గ స్థాయి పదవులకే పరిమితం చేసి పార్టీలో తమ వర్గాన్ని చిన్నచూపు చూసినట్లు కృష్ణుడు వెల్లడించారు.