ఓటు పాఠం చెబుతాం వినండి..
ABN , Publish Date - Apr 08 , 2024 | 12:47 AM
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు పిలుపునిచ్చారు.
![ఓటు పాఠం చెబుతాం వినండి..](https://media.andhrajyothy.com/media/2024/20240407/7_KADIYAM_1_80073342b9.gif)
కడియం, ఏప్రిల్ 7: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు పిలుపునిచ్చారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కడియం ఎంఆర్సీ నుంచి దేవీచౌక్ సెంటర్ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీ చేశారు. ఓటు పాఠం చెబుతాం వినండి అంటూ నినాదాలు చేశారు. బొబ్బిలిబ్రిడ్జి సెంటర్లో మానవాహారం నిర్వహించి ఓటు విలువ తెలిపారు.డీఈవో వాసుదేవరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అన్నారు.ఓటు ద్వారా ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. కడియం ఎంఈవో-1,2 మణికుమార్, వై.నాగేశ్వరరావు, హెచ్ఎం టి.సత్యనారాయణ, ఈవీఎస్ఆర్ ప్రసాద్, విశ్వనాఽథం, యూటీఎఫ్,ఎస్టీయూ నాయకులు అబ్బాయి,ఆనందవిజయకుమార్, వ ల్లూరి శ్రీనివాసరావు, టీవీఎస్ ప్రసాద్,సబ్బితి శ్రీనివాసరావు పాల్గొన్నారు.