Share News

47 మంది వలంటీర్లు రాజీనామా

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:52 AM

వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. గోపాలపురం, కోమటిగుంట గ్రామాల్లో వలంటీర్లు బుధవారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.

47 మంది వలంటీర్లు రాజీనామా

గోపాలపురం/నిడదవోలు, ఏప్రిల్‌ 3: వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. గోపాలపురం, కోమటిగుంట గ్రామాల్లో వలంటీర్లు బుధవారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ మేరకు పత్రాలను ఎంపీడీవో రమేష్‌కు బుధవారం సమర్పించారు. ఎంపీడీవో మాట్లా డుతూ కోమటిగుంట, గోపాలపురం గ్రామాల్లో పని చేస్తున్న 34 మంది వలంటీర్లు రాజీనామా చేసినట్టు చెప్పారు. నిడదవోలులో 13 మంది వలంటీర్లు కమిషనర్‌ రాం భూపాల్‌రెడ్డికి రాజీనామా పత్రాలను అందించారు. దీంతో బుధవారం ఒక్కరోజే 47 మంది రాజీనామా చేయడం గమనార్హం.

Updated Date - Apr 04 , 2024 | 12:52 AM