18న వికాసలో జాబ్మేళా
ABN , Publish Date - Mar 16 , 2024 | 12:08 AM
కాకినాడ సిటీ, మార్చి 15: కాకినాడ వికాస కార్యాలయం లో ఈనెల 18న జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు వికాస పీడీ కె.లచ్చారావు తెలిపారు. ఈ జాబ్మేళాలో పలు కంపెనీల్లో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు జరపనున్నారన్నారు. ఈ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ, ఇంటర్, డిప్లమో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 35ఏళ్లలోపు
![18న వికాసలో జాబ్మేళా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
వికాస పీడీ లచ్చారావు
కాకినాడ సిటీ, మార్చి 15: కాకినాడ వికాస కార్యాలయం లో ఈనెల 18న జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు వికాస పీడీ కె.లచ్చారావు తెలిపారు. ఈ జాబ్మేళాలో పలు కంపెనీల్లో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు జరపనున్నారన్నారు. ఈ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ, ఇంటర్, డిప్లమో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 35ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. వారికి నెలకు రూ.12వేల నుంచి రూ.25వేల వరకు జీతం, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాల ఆధారంగా ఉం టుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం ఉదయం 9 గంటలకు కాకినాడ కలెక్టరేట్ వికాస కార్యాలయం వద్దకు సర్టిఫికెట్ల జిరాక్స్లతో హాజరుకావాలన్నారు. వివరాలకు 77993 76333 నెంబరులో సంప్రదించాలని పీడీ తెలిపారు.