Share News

ఉపాధి సిబ్బందిపై వేటు

ABN , Publish Date - May 27 , 2024 | 12:31 AM

జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగ్గంపేటకు చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గొల్లపల్లి రత్నరాజు, సీనియర్‌ మేట్‌ రెడ్డి భానుప్రతాప్‌లపై అధికారులు వేటు వేశారు.

ఉపాధి సిబ్బందిపై వేటు

జగ్గంపేట, మే 26: జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగ్గంపేటకు చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గొల్లపల్లి రత్నరాజు, సీనియర్‌ మేట్‌ రెడ్డి భానుప్రతాప్‌లపై అధికారులు వేటు వేశారు. ఈ ఇద్దరూ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో పనిచేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనని పలువురు ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వారు ప్రచారం చేస్తున్న ఫొ టోలను అందజేశారు. డ్వామా అధికారులు ఆరోపణలపై విచారణ చేసిన తర్వాత విధుల నుంచి తొలగిస్తూ ఉత్త ర్వులు జారీ చేశారు. సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - May 27 , 2024 | 12:31 AM