Share News

వైసీపీ గల్లంతు ఖాయం

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:27 AM

తొండంగి, జనవరి 4: రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన సృష్టించే సునామీలో వైసీపీ గల్లంతవ్వడం ఖాయమని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. గురువా రం కొమ్మనాపల్లి గ్రామంలో నిర్వహించిన మీ ఇంటికి - మీ దివ్య కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకుని అనేకమంది వైసీ

వైసీపీ గల్లంతు ఖాయం

తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య

తొండంగి, జనవరి 4: రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన సృష్టించే సునామీలో వైసీపీ గల్లంతవ్వడం ఖాయమని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. గురువా రం కొమ్మనాపల్లి గ్రామంలో నిర్వహించిన మీ ఇంటికి - మీ దివ్య కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకుని అనేకమంది వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారన్నారు. ఎక్కడ చూసినా టీడీపీ ప్రభంజనం కనబడుతోందని, రానున్న ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలంతా ఐక్యంగా పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. కరపత్రాలు పంపిణీ చేశారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు యనమల శివరామకృష్ణ, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి పేకేటి హరికృష్ణ, పార్టీ మండలాధ్యక్షులు చొక్కా అప్పారావు, ప్రధాన కార్యదర్శి మురాలశెట్టి సత్యన్నారాయణ, కోన రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:27 AM