ప్రజలందరికీ అండగా ఉంటా : యనమల దివ్య
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:01 AM
తుని రూరల్, జనవరి 27: రాపాక ప్రజలు ఆ శీర్వదించాలని, అందరికీ అండగా ఉంటానంటూ తుని టీడీపీ ఇన్చార్జి యనమల దివ్య అన్నారు. మీ ఇంటికి మీదివ్య కార్యక్రమంలో మండలం లోని రాపాక గ్రామంలో ఇంటింటా ప్రచారం ని ర్వహించారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందని, మద్యపానాన్ని నిషేధిస్తానన్న ముఖ్యమంత్రి కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు బలిగొంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ సరైన నిర్ణయం తీసుకోవాలని టీడీపీ, జనసేన కూటమి కి పట్టం క
![ప్రజలందరికీ అండగా ఉంటా : యనమల దివ్య](https://media.andhrajyothy.com/media/2023/20231205/27_Tuni_rural1_ddc52660d8.gif)
తుని రూరల్, జనవరి 27: రాపాక ప్రజలు ఆ శీర్వదించాలని, అందరికీ అండగా ఉంటానంటూ తుని టీడీపీ ఇన్చార్జి యనమల దివ్య అన్నారు. మీ ఇంటికి మీదివ్య కార్యక్రమంలో మండలం లోని రాపాక గ్రామంలో ఇంటింటా ప్రచారం ని ర్వహించారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందని, మద్యపానాన్ని నిషేధిస్తానన్న ముఖ్యమంత్రి కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు బలిగొంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ సరైన నిర్ణయం తీసుకోవాలని టీడీపీ, జనసేన కూటమి కి పట్టం కట్టి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్, ఎన్.సూరవరం మాజీ సర్పంచ్ చింతమనీడి నాగ సోమరాజు(అబ్బాయి), మంతెన గంగరాజు, గంధం బాబ్జి, ఉండా రాము, జి.రమణ తదితరులు ఉన్నారు. రాపాకలో వైసీపీ నుంచి టీడీపీలోకి పలువురు వార్డుమెంబర్లు చేశారు. వారికి యనమల శివరామకృష్ణన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట మండలానికి చెందిన టీడీపీ నాయకులు ఉన్నారు.