ఆదివాసీలకు పెద్దపీట వేసే పార్టీలకే మద్దతు
ABN , Publish Date - Feb 07 , 2024 | 12:35 AM
రాబోయే ఎన్నికలలో గిరిజనులకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీలకే ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ (టి.ఎస్.ఎఫ్) మద్దతు అని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.
![ఆదివాసీలకు పెద్దపీట వేసే పార్టీలకే మద్దతు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
టి.ఎస్.ఎఫ్ నాయకులు
దివాన్చెరువు, ఫిబ్రవరి 6: రాబోయే ఎన్నికలలో గిరిజనులకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీలకే ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ (టి.ఎస్.ఎఫ్) మద్దతు అని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ (టి.ఎస్.ఎఫ్) జాతీయ కమి టీ ఆధ్వర్యంలో స్థానిక ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కన్వెన్షన్ భవనంలో జరుగుతున్న జాతీయస్ధాయి ఆదివాసీల సాంస్కృతిక మహోత్స వాలు మంగళ వారం రెండోరోజుకు చేరుకున్నాయి. టి.ఎస్.ఎఫ్. వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లిభా స్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టి.ఎస్.ఎఫ్ జాతీయ అధ్యక్షుడు కె.అక్కు లప్పనాయక్, రాష్ట్రఅధ్యక్షుడు ఆర్.చంద్రప్ప, రాష్ట్రకార్యదర్శి విష్ణునాయక్ మా ట్లాడుతూ గిరిజన సాంస్కృతిక మహోత్సవం విజయవంత మైందన్నారు. ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాను న్న ఎన్నికలలో గిరిజనుల అభ్యున్నతికి, అభివృద్ధికి పెద్దపీట వేసిన పార్టీలకే టి.ఎస్.ఎఫ్.సం పూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. గిరిజనులకు రాజ్యసభ సీటు ఇవ్వాలని, మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయపార్టీలు తమ ఓటుబ్యాంకు రాజకీయాలకోసం గిరిజన జాబితాలో ఇతర కులాలను చేరుస్తామంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజకుమార్రెడ్డి, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు నాయక్, రామరాజు, రఘునాధనాయక్, మల్లికార్జుననాయక్, వెంక టేష్, వినోద్నాయక్, హరినాయక్, వెంకటరమణ, శివాజీనాయ