Share News

ముగిసిన టెన్‌షన్‌

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:25 AM

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

ముగిసిన టెన్‌షన్‌
కొవ్వూరులో పరీక్షా కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు

రాజమహేంద్రవరం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలకు కొద్ది రోజుల ముందే చార్జి తీసుకున్న జిల్లా పాఠశాల విద్యాధికారి వాసుదేవరావు ఉన్నతాధికారుల ఆదేశా లను పాటిస్తూ చర్యలు తీసుకున్నారు.విద్యార్థులకు ఎలాంటి అసౌ క ర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ జగదీశ్‌ పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సదుపాయాలపై ఆరా తీశారు. చివరిగా సోషల్‌ పరీక్ష బుధవారం జరిగింది. ఈ పరీక్షకు 25,293 మంది హాజరు కావాల్సి ఉండగా 23,915 మంది హాజర య్యా రు.1375 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాం ఛనీయ సంఘనలూ జరగలేదని డీవీఈవో పేర్కొన్నారు.చివరి రోజు బుధవారం పరీక్ష ముగిసిన వేళ విద్యార్థుల్లో ఉత్సాహం కనబడింది. ఒకేషనల్‌ విద్యకు సంబంధించిన పరీక్షలు రెండు రోజులు జరగనున్నాయి.

Updated Date - Mar 28 , 2024 | 12:25 AM