Share News

వాడపల్లికి పోటెత్తిన భక్తజనం

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:27 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సందడి నెలకొంది.

వాడపల్లికి పోటెత్తిన భక్తజనం

ఆత్రేయపురం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సందడి నెలకొంది. వేకువజామునే స్వామివారికి గోదావరి జలాలను తీర్థపు బిందె తో తీసుకువచ్చి స్నపన మూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం తిరుప్పావై వేదపారాయణం జరిపారు. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.2,68,922 వచ్చినట్టు ఉప కమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

స్వామివారిని దర్శించుకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు: వాడపల్లి వేంకటేశ్వరస్వామిని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు.

రావులపాలెం: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద ఆలయ ఉపకమిషనరు నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ కేవీ సత్యనారాయణరెడ్డి, ప్రాజెక్టు కమిటీ వైస్‌ చైర్మన్‌ కరుటూరి నరసింహారావు, ముదునూరి వెంకట్రాజు, కాయల జగన్నాధం, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 01:27 AM