వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
ABN , Publish Date - May 03 , 2024 | 12:39 AM
సామర్లకోట, మే 2: సామర్లకోటకి చెందిన వైసీపీ కౌన్సిలర్ నక్కా లలిత భర్త నక్కా శ్రీనివాస్, మరిది నక్కా జానకిరామయ్య, వీరి తండ్రి నక్కా బాబూరావు తదితర 60 కుటుంబాలు వైసీపీని వీడి గురువారం టీడీపీలోకి చేరారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ తది
![వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సామర్లకోట, మే 2: సామర్లకోటకి చెందిన వైసీపీ కౌన్సిలర్ నక్కా లలిత భర్త నక్కా శ్రీనివాస్, మరిది నక్కా జానకిరామయ్య, వీరి తండ్రి నక్కా బాబూరావు తదితర 60 కుటుంబాలు వైసీపీని వీడి గురువారం టీడీపీలోకి చేరారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ తదితర పట్టణ టీడీపీ నాయకుల ఆద్వర్యంలో నక్కా కుటుంబీకుల ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చినరాజప్ప హాజరయ్యి నూతనంగా పార్టీలోకి చేరిన నక్కా కుటుంబీకులకు టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి అభినందించారు. అరాచక వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాయాలపై పోరాటాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీతో కలిసి పోరాడేందుకు ముందుకొచ్చేవారికి తెలుగుదేశం ద్వారాలు తెరిచే ఉంటాయని ఎమ్మెల్యే చినరాజప్ప చెప్పారు. పలువురు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సామర్లకోట పట్టణంలో బలుసులపేటకు చెందిన వైసీపీ నాయకులు పెయ్యల చక్రవర్తి తదితర 20 మంది అనుచరులతో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే చినరాజప్ప తనయుడు రంగనాగ్, 13వ వార్డు టీడీపీ నాయకులు కాళ్ళ రవీంద్ర తదితర పట్టణ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చినరాజప్ప పార్టీలోకి చేరినవారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి అభినందించారు.