శెట్టిబలిజలకు టీడీపీలోనే సముచిత స్థానం
ABN , Publish Date - Feb 20 , 2024 | 12:01 AM
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 19: శెట్టిబలిజలకు టీడీపీలోనే సముచిత స్థానం లభిస్తోందని టీడీపీ శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు అన్నారు. కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రఽధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా అధ్యక్షతన కాకి నాడ సిటీ, రూరల్ నియోజకవర్గ పార్టీ శెట్టిబ లిజ నాయకుల సమావేశం సోమవారం జరిగిం ది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర కన్వీనర్ సత్తి బాబు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో శెట్టిబ
![శెట్టిబలిజలకు టీడీపీలోనే సముచిత స్థానం](https://media.andhrajyothy.com/media/2024/20240215/19_KKD_6_afdaa8f9b6.gif)
టీడీపీ శెట్టిబలిజ సాధికార సమితి కన్వీనర్
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 19: శెట్టిబలిజలకు టీడీపీలోనే సముచిత స్థానం లభిస్తోందని టీడీపీ శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు అన్నారు. కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రఽధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా అధ్యక్షతన కాకి నాడ సిటీ, రూరల్ నియోజకవర్గ పార్టీ శెట్టిబ లిజ నాయకుల సమావేశం సోమవారం జరిగిం ది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర కన్వీనర్ సత్తి బాబు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో శెట్టిబలిజ కులానికి చెందిన పలువురికి సీట్లు, పదవుల విషయంలో తగిన ప్రాధాన్యం కల్పిం చారన్నారు. రాబోయే టీడీపీ ప్రభుత్వంలోను తగిన ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చార న్నారు. మార్చి మొదటివారంలో నిర్వహించే నిర్వహించే శెట్టిబలిజ సాధికారిత రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా మాట్లాడుతూ శెట్టిబలిజల ఐక్యత ద్వారా టీడీపీలో రాజకీయ ప్రాధాన్యాన్ని సాధిం చుకోగలమన్నారు. నాయకులు దాసరి వీరవెం కట సత్యనారాయణ, పంపన బుజ్జి, చొల్లంగి వీ రబాబు, కాకరపల్లి చలపతి, పలివెల త్రిమూ ర్తులు, కొండా వినాయక్, పితాని అప్పన్న, వా సంశెట్టి చిట్టప్ప, రాయుడు అనిల్ పాల్గొన్నారు.