Share News

విజయీభవ

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:38 AM

విజయీభవ! అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని కూటమి అభ్యర్థులను ఆశీర్వదించారు.

విజయీభవ
జయం మనదే : చంద్రబాబు అందజేసిన బి.ఫారాలతో టీడీపీ అభ్యర్థులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి వాసు, మద్దిపాటి

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి) : విజయీభవ! అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని కూటమి అభ్యర్థులను ఆశీర్వదించారు. టీడీపీ అభ్యర్ధులకు ఆదివారం బి.ఫారాలు అంద జేసి విజేతలుగా రావాలని సూచించారు. రాజమహేంద్రవరం రూరల్‌ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సిటీ అభ్యర్థి ఆదిరెడ్డివాసు, కొవ్వూరు అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు ఆదివారం అమరా వతి వెళ్లి చంద్రబాబు చేతుల మీదుగా బి.ఫారాలు అందుకున్నారు. కూటమి తరపున జనసేన నేతలు నిడదవోలు నుంచి కందుల దుర్గేష్‌, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణలకు రెండు రోజుల కిందటే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బి.ఫారాలు అందజేశారు. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తప్ప మిగతా కూటమి సభ్యులంతా ఇప్పటికే నామినేషన్లు దాఖలుచేశారు.లోక్‌సభ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.సోమవారం బత్తుల బలరామకృష్ణ; మం గళవారం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్లు దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం ఉన్న సంగతి తెలిసిందే. అందులో కూటమి తరపున టీడీపీ నాలుగుచోట్ల, జనసేన రెండు చోట్ల, బీజేపీ ఒక చోట పోటీ చేస్తోంది. లోక్‌సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - Apr 22 , 2024 | 12:38 AM