వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యం
ABN , Publish Date - Jan 17 , 2024 | 11:17 PM
తాళ్లరేవు, జనవరి 17: రాష్ట్రాన్ని అప్పులపాలుచేసి రాజధాని అడ్రస్ లేకుండా చేసిన వైసీపీ ప్ర భుత్వాన్ని ఓడించడమే జనసేన, టీడీపీ పార్టీల ఉమ్మడి లక్ష్యమని ముమ్మిడివరం జనసేన కోఆర్డీ నేటర్ పితాని బాలకృష్ణ అన్నారు. బుధవారం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్ ఇన్చార్జి టేకుమూడి లక్ష్మణరావు అధ్యక్షతన జనసేన, టీడీపీ ఉమ్మడి సమావేశం జరిగింది. 20న మండపేటలో జరిగే రా... కదలిరా తెలుగుదేశం పిలుస్తోంది కార్యక్రమానికి జన
![వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యం](https://media.andhrajyothy.com/media/2023/20231205/17_Tlr_11_0919eeabf9.gif)
తాళ్లరేవులో జనసేన, టీడీపీ సమావేశం
తాళ్లరేవు, జనవరి 17: రాష్ట్రాన్ని అప్పులపాలుచేసి రాజధాని అడ్రస్ లేకుండా చేసిన వైసీపీ ప్ర భుత్వాన్ని ఓడించడమే జనసేన, టీడీపీ పార్టీల ఉమ్మడి లక్ష్యమని ముమ్మిడివరం జనసేన కోఆర్డీ నేటర్ పితాని బాలకృష్ణ అన్నారు. బుధవారం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్ ఇన్చార్జి టేకుమూడి లక్ష్మణరావు అధ్యక్షతన జనసేన, టీడీపీ ఉమ్మడి సమావేశం జరిగింది. 20న మండపేటలో జరిగే రా... కదలిరా తెలుగుదేశం పిలుస్తోంది కార్యక్రమానికి జనసమీకరణలు చేసి అత్యధికంగా తరలించాలని ఉమ్మడి నేతలు చర్చించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ వైసీపీ అహంకార ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని జనసైనికులు, టీడీపీ నేతలు సమన్వయంతో పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలు చేయాలన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకుడు, మాజీమంత్రి చిక్కాల రామచంద్రరావు, తాళ్లరేవు ఇన్చార్జి గదుల సాయి పర్యవేక్షించారు. కార్యక్రమంలో జనసైనికులు అత్తిలి బాబూరావు, గండి అనిల్, పుణ్యమంతుల సత్తిబాబు, వీరమహిళ ముత్యాల జయలక్ష్మి, టీడీసీ మహిళలు పొన్నమండ రామలక్ష్మి, పెమ్మాడి కృష్ణవేణి, వెంటపల్లి ఉమామహేశ్వరి, మోపూరి వెంకటేశ్వరరావు, స ర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు పాల్గొన్నారు.