Share News

నేడు కూటమి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:20 AM

కాకినాడ సిటీ/సర్పవరం జంక్షన్‌/జగ్గంపేట: జిల్లాలో పలువురు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు కాకినాడ జగన్నాథపురంలోని తన నివాసం నుంచి కాకినాడ సిటీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు భారీసైకిల్‌ ర్యాలీ

నేడు కూటమి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

కాకినాడ సిటీ/సర్పవరం జంక్షన్‌/జగ్గంపేట: జిల్లాలో పలువురు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు కాకినాడ జగన్నాథపురంలోని తన నివాసం నుంచి కాకినాడ సిటీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు భారీసైకిల్‌ ర్యాలీగా బయలుదేరి కార్పొరేషన్‌ కార్యాల యంలో రిటర్నింగ్‌ అధికారికి ఉదయం 11.30 గంటలకు నామినేషన్‌ అందజేశారు. కాకినాడ రూరల్‌ కూటమి అభ్యర్థిగా పంతం నానాజీ ఉదయం వలసపాకల గంగరాజునగర్‌ జనసేన కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రగా సర్పవరం జంక్షన్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్దకు చేరుకుని మధ్యాహ్నం ఒంటిగంటకు నామినేషన్‌ వేయనున్నారు. జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ స్వగ్రామమైన ఇర్రిపాక నుంచి ఉదయం 10.30గంటలకు బయలుదేరి జగ్గంపేట ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:20 AM