Share News

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జవహర్‌

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:41 AM

టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్ఠానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జవహర్‌

కొవ్వూరు, మార్చి 26: టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్ఠానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జవహర్‌ నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరిపారు. జవహర్‌ మాట్లాడుతూ పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌, నందమూరి బాలకృష్ణ, రాష్ట్రాధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుడిగా ఉన్న జవహర్‌ను గుర్తించి 2014 లో టీడీపీ కొవ్వూరు నుంచి నిలబెట్టిన సంగతి తెలిసిందే. అపుడు గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఎన్నికల ముందు ఆయన సేవలు ఉపయోగించుకోవాలని అధిష్ఠానం భావించినట్టుంది. ఆయనకు ఏకం గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది.

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా

రెడ్డి సుబ్రహ్మణ్యం

కొత్తపేట, మార్చి 26: టీడీపీ పొలిట్‌బ్యూ రో సభ్యుడిగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. రెడ్డి సుబ్రహ్మణ్యం గతంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా చేశారు. ప్రస్తుతం రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా వున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యా నికి పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ముదునూరి

ప్రత్తిపాడు, మార్చి 26: టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రత్తిపాడు మండలం ధర్మవరంనకు చెందిన ముదునూరి మురళీకృష్ణంరాజు నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర అధ్యక్షు డు అచ్చెంనాయుడు ఆదేశాలు జారీ చేశారు. అమలాపురం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా ఉన్న మురళీకృష్ణంరాజును తాజాగా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించడం పట్ల నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మురళీరాజుకు పదవి రావడంపై జిల్లాలోని పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా వాసిరెడ్డి ఏసుదాసు

సర్పవరం జంక్షన్‌, మార్చి 26: తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శిగా కాకినాడరూరల్‌ మాజీ ఎంపీపీ వాసిరెడ్డి ఏసుదాసును నియమిస్తూ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మంగళవారం విడుదలచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనకు పదవి అప్పగించిన చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో పాటూ ఇతర నాయకులకు ఏసుదాసు కృతజ్ఞతలు తెలిపారు. పంతం నానాజీ విజయంతోపాటూ జిల్లాలో అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. టీడీపీ నాయకులు ఏసుదాసును అభినందించారు.

Updated Date - Mar 27 , 2024 | 12:41 AM