టీడీపీ హయాంలోనే అధిక పింఛన్లు
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:50 AM
టీడీపీ హయాంలోనే అధిక పింఛన్లు
మండపేట, జనవరి 7: టీడీపీ ప్రభుత్వ హయాంలో 7,335 కొత్త పింఛన్లు మంజూరు చేస్తే, వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 5,300 పింఛన్లు మాత్రమే మంజూరు చేసిందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పింఛన్లు ఎవరి హయాంలో ఎక్కువ ఇచ్చారో చర్చించేందుకు సిద్ధమా అంటూ ఆయన చాలెంజ్ విసిరారు. ఇప్పటి వరకు పెంచిన పింఛన్లు అందించిన దాఖలాలు లేవన్నారు. మాటల గారడి తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమిలేదన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ పట్టణ అధక్షుడు ఉంగరాల రాంబాబు, ఎ.రామకృష్ణచౌదరి తదితరులు పాల్గొన్నారు.