జనసేన నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Feb 07 , 2024 | 01:45 AM
జనసేన నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
![జనసేన నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/Untitled_19999_89f61a24df.jpg)
జిల్లా ఎస్పీకి జనసేన నేతల వినతిపత్రం
కాకినాడ క్రైం, ఫిబ్రవరి 6: పిఠాపురం జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మాదేపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పిఠాపురం ఇన్చార్జి తంగెళ్ల శ్రీనివాస్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, వరుపుల తమ్మయ్యబాబులతో కలసి కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎస్.సతీష్కుమార్ని కలుసుకు ని ఫిర్యాదు అందజేశారు. ఈసందర్భంగా దుర్గేష్, శ్రీనివాస్లు మాట్లాడుతూ శ్రీనివాసరావుపై పిఠాపురం జనసేన కార్యాలయం వీధిలో కత్తితో పలుమార్లు రెక్కీ నిర్వహించారన్నారు. ప్రశాంతతకు మారుపేరైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటు వంటి హత్యా రాజకీయాలకు ప్రయత్నించడం పట్ల దిగ్భాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి, ఎవరి ప్రమేయం ఉందో దర్యాప్తు చేయాలన్నారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవాలని కోరారు. విచారణ నిర్వహించి దాడికి ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.