సూపర్సిక్స్తో పేదల జీవితాల్లో వెలుగులు: సుభాష్
ABN , Publish Date - Apr 30 , 2024 | 01:18 AM
కూటమి అధికారంలోకి వచ్చి చంద్ర బాబునాయుడు ముఖ్య మంత్రి అయితే సూపర్సిక్స్ పథ కాలతో పేదల జీవితాలు వెలు గులు నిండుతాయని కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అన్నారు.
![సూపర్సిక్స్తో పేదల జీవితాల్లో వెలుగులు: సుభాష్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కె.గంగవరం, ఏప్రిల్ 29: కూటమి అధికారంలోకి వచ్చి చంద్ర బాబునాయుడు ముఖ్య మంత్రి అయితే సూపర్సిక్స్ పథ కాలతో పేదల జీవితాలు వెలు గులు నిండుతాయని కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సోమవారం పేకేరు, నల్లచెరువుపుంత గ్రామాల్లో ఆయన మాజీమంత్రి జవహ ర్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో టీడీపీ నాయకులు సుభాష్కు ఘన స్వాగతం పలికారు. టీడీపీ, జన సేన, బీజేపీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కూడళ్లలో సూపర్సిక్స్ పథకాలు గురించి వివరించారు. వృద్ధురాలి సమస్యలు విన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెలలో ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ కలుపుకుని రూ.7వేలు పింఛన్ ఇంటికి పంపిస్తామన్నారు. దీనికి వృద్ధురాలి సంతోషంతో సుభాష్ తలపై చెయ్యివేసి ఆశీశులు అందించారు. మరో కూడలిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతీ నెల రూ.1500 ఆర్థిక సాయం గురించి వివరించగా మహిళలు హారతులు ఇచ్చి మద్దతు తెలిపారు. మే 13న జరిగే ఎన్ని కల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చలగళ్ళ నాగేశ్వరరావు, గోపాలకృష్ణ, రేవు శ్రీను, పర్తంశెట్టి శ్రీనివాసరావు, మేడిశెట్టి రవికుమార్, మరివాడ చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.