మే 1 నుంచి వేసవి యోగా శిక్షణ
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:27 AM
కార్పొరేషన్ (కాకినాడ), ఏప్రిల్ 18: కాకినాడ వివేకానంద పార్కులో ఉన్న రెడ్క్రాస్ యోగా కేంద్రం నందు మే నెల 1 నుంచి 16 వరకు 8 నుంచి 14 ఏళ్లలోపు బాల, బాలికలకు వేసవి యోగా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు రెడ్క్రాస్ చైర్మన్ వైడి రామారావు తెలిపారు. ఉదయం 9 నుంచి 12గంటల వరకు జరిగే శిక్షణ
కార్పొరేషన్ (కాకినాడ), ఏప్రిల్ 18: కాకినాడ వివేకానంద పార్కులో ఉన్న రెడ్క్రాస్ యోగా కేంద్రం నందు మే నెల 1 నుంచి 16 వరకు 8 నుంచి 14 ఏళ్లలోపు బాల, బాలికలకు వేసవి యోగా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు రెడ్క్రాస్ చైర్మన్ వైడి రామారావు తెలిపారు. ఉదయం 9 నుంచి 12గంటల వరకు జరిగే శిక్షణలో పిల్లలకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, సూర్య నమస్కారాలు, ధార్మిక, నైతిక విలువలు, దేశభక్తి గీతాలు, హస్తకళలు, చేతివ్రాత మెళకువలు, బుద్ధి వికాసాన్ని పెంచే ఆటలు, ప్రథమ చికిత్సలో శిక్షణ ఇస్తామన్నారు. 9603881211, 9640983726లో సంప్రదించి ముందుపేర్లు నమోదు చేసుకున్న 50మందికి మాత్రమే అవకాశముందన్నారు.