Share News

సుబ్బరాజుకు మంత్రి పదవి ఇవ్వాలి

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:42 AM

రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే విజేత దాట్ల సుబ్బరాజుకు (బుచ్చిబాబుకు) మంత్రివర్గంలో స్థానం కల్పించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్‌సాగర్‌ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.

సుబ్బరాజుకు మంత్రి పదవి ఇవ్వాలి

ముమ్మిడివరం, జూన్‌ 10: రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే విజేత దాట్ల సుబ్బరాజుకు (బుచ్చిబాబుకు) మంత్రివర్గంలో స్థానం కల్పించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్‌సాగర్‌ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ముమ్మిడివరంలోని టీడీపీ కార్యాలయంలో నాగిడి నాగేశ్వరరావు అధ్యక్షతన సోమవారం జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, పార్టీ సీనియర్‌ నాయకుడు నాగిడి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు తాడి నరసింహారావులు మాట్లాడుతూ దాట్ల సుబ్బరాజు నియోజకవర్గ పరిధిలోనే కాకుండా జోన్‌-2 పరిధిలో అత్యంత సమర్థత కలిగిన నాయకుడిగా పార్టీలోను, ప్రజల్లోను గుర్తింపు పొందారన్నారు. సుబ్బరాజును చంద్రబాబు కేబినేట్‌లో తీసుకుని ఆయనకు సముచిత స్థానం కేటాయించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సమావేశంలో గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్‌, పొద్దోకు నారాయణరావు, వాడ్రేవు వీరబాబు, దొమ్మేటి రమణకుమార్‌, మందాల గంగసూర్యనారాయణ, అర్థాని శ్రీనివాసరావు, నడింపల్లి సుబ్బరాజు, ఆకాశం శ్రీనివాస్‌, జనిపల్లి సోమన్న, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండల రామలక్ష్మి, దండుప్రోలు సత్యం, రాయపురెడ్డి నీకలంఠేశ్వరరావు, చిక్కాల అంజిబాబు, సాగి సూరిబాబురాజు, యాళ్ల ఉదయ్‌, గుద్దటి జమి, దూడల స్వామినాయుడు, గోదశి పుండరీష్‌, గొల్లపల్లి గోపి, మెండి కమల పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 12:42 AM