దళితులకు అండగా ఉంటా: బండారు
ABN , Publish Date - Apr 13 , 2024 | 12:40 AM
వైసీపీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని నియోజకవర్గంలో అన్ని వర్గాలతో పాటు దళితులకూ అండగాఉంటానని కొత్తపేట అసెంబ్లీ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు.
![దళితులకు అండగా ఉంటా: బండారు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కొత్తపేట, ఏప్రిల్ 12: వైసీపీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని నియోజకవర్గంలో అన్ని వర్గాలతో పాటు దళితులకూ అండగాఉంటానని కొత్తపేట అసెంబ్లీ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. శుక్రవారం స్థానిక కాపు కల్యాణ మండపంలో నియోజకవర్గ దళిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దళిత నాయకులు మాట్లాడుతూ మనకి మంచి రోజులు రావాలంటే ‘దళితుల పంతం-వైసీపీ అంతం’ నినాదంతో రాష్ట్రంలో జగన్ని, కొత్తపేటలో జగ్గిరెడ్డిని గద్దెదించేందుకు కంకణం కట్టుకోవాలన్నారు. సమావేశంలో దళిత నాయకులు పల్లి భీమారావు, బూసి జయలక్ష్మీభాస్కరరావు, దండంగి మమత, సాదే లక్ష్మీశ్రీనివాస్, బీర ఇసాక్, చిల్లి ప్రసాదరావు, నక్కా వెంకటేశ్వరరావు, బూసి మరియమ్మ, పల్లి శాంతి పాల్గొన్నారు.