Share News

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:29 AM

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ సెక్షన్‌ పరిధిలో సామర్లకోట మీదుగా ఐదు సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపనున్నట్లు రైల్వే ఉన్నతాధికారి కార్యాలయం నుంచి సమాచారం అందింది.

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

సామర్లకోట, జనవరి 7: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ సెక్షన్‌ పరిధిలో సామర్లకోట మీదుగా ఐదు సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపనున్నట్లు రైల్వే ఉన్నతాధికారి కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఈ మేరకు సామర్లకోట రైల్వే ఉన్నతాధికారి నుంచి ఆంధ్రజ్యోతి సమాచారాన్ని సేకరించింది. 07066 నంబరు గల సికింద్రాబాద్‌-కాకినాడ మధ్య రాకపోకలు సాగించే సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 10 తేదీ బుధవారం ఒక ట్రిప్‌ బయలుదేరనుంది. ఈ రైలు బుధవారం సికింద్రాబాద్‌లో రాత్రి 7.00 గంటలకు బయలుదేరి పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం, తణుకు, నిడదవోలు మీదుగా రాజమండ్రికి గురువారం తెల్లవారుజామున 5.15 నిమిషాలకు చేరుకుని కాకినాడకు ఉదయం 7.10కి చేరు తుంది. 07067 నంబరు గల కాకినాడ-సికింద్రాబాద్‌ మధ్య సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం జనవరి 11 తేదీ రాత్రి 9.00కి బయలుదేరి, సామర్లకోటకు 9.20కి చేరు కుంటుంది. రాజమండ్రికి 10.10కి చేరుకుంటుంది. నిడదవోలు, తణుకు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్‌కు శుక్రవారం ఉదయం 8.50కు చేరుతుంది. 07251 నంబరు గల సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు కాకినాడ-తిరుపతి మధ్య జనవరి 13న శనివారం సాయంత్రం కాకినాడలో సాయ ంత్రం 5.10 గంటలకు బయలుదేరుతుంది. సామర్లకోటకు 5.25కి చేరుకుంటుంది. రాజమండ్రికి రాత్రి 6.20కి చేరుకుంటుంది. నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి ఆదివారం తెల్లవారుజామున 4.30కి చేరుతుంది. 07250 నంబరు గల సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్‌-కాకినాడల మద్య జరి 17న బుధవారం సాయంత్రం 6.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలు దేరనుంది. పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలుల మీదుగా రాజ మండ్రికి అర్దరాత్రి 2.40కి చేరుతుంది., సామర్లకోటకు తెల్లవారుజామున 3.35కి చేరుకుని కాకినాడకు గురువారం తెల్లవారుజామున 4 గంటలకు చేరుకుంటుంది. 07253 నంబరు గల సంక్రాంతి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు కాకినాడ-సికింద్రాబాద్‌ మధ్య జనవరి 16న మంగళవారం సాయంత్రం 5.10కు కాకినాడలో బయలు దేరుతుంది. సామర్లకోటకు సాయంత్రం 5.25కి చేరుకుని, రాజమండ్రి రాత్రి 6.20కి చేరుకుంటుంది., నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా సికింద్రా బాద్‌కు బుధవారం తెల్లవారుజామున 5.20కి చేరు కుంటుంది. మరిన్ని వివరాలకు, రైలు రిజర్వేషన్‌ టిక్కెట్లకు సమీప రైల్వే స్టేషన్‌ బుకింగ్‌ కార్యాలయాల వద్ద సంప్ర దించాలని రైల్వే ఉన్నతాధికారి అందించిన సమాచారంలో తెలిపారు.

Updated Date - Jan 08 , 2024 | 12:29 AM