Share News

ఆర్పీఐ విజయానికి కృషి చేయాలి

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:52 AM

ఆర్పీఐ విజయానికి కృషి చేయాలి

ఆర్పీఐ విజయానికి కృషి చేయాలి

ముమ్మిడివరం, జనవరి 7: రానున్న సార్వత్రిక ఎన్ని కల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు ఎన్‌ఎం రుషి పిలుపునిచ్చారు. స్థానిక పోలమ్మ చెరువుగట్టున జైబుద్ద పార్కులో పంతగడ నరసింహ మూర్తి అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముమ్మిడివరం అసెంబ్లీ అభ్యర్థిగా మట్టా సిద్ధార్థగౌతమ్‌ను సమావేశం ఏకగ్రీవంగా ఎన్ను కుంది. బళ్ల సత్యనారాయణ, ఈవీవీ సత్యనారాయణ, చీకురుమిల్లి శ్రీనివాస్‌, పంతగడ అప్పారావు, మోకా కృష్ణమూర్తి, వెంటపల్లి నాగేశ్వరరావు, చీకురు మెల్లి చిరంజీవి, రేవు శ్రీను, ఎస్‌.పృథ్విరాజ్‌, కె.వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:52 AM