వ్యాన్ ఢీకొని యువకుడి మృతి
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:28 AM
గండేపల్లి, ఏప్రిల్ 17: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిసంఘటన మంగళవారం రాత్రి సూరంపాలెంలో ఏడీబీరోడ్డు వద్ద జరిగింది. గండేపల్లి పోలీసులు తెలిపిన వివ
గండేపల్లి, ఏప్రిల్ 17: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిసంఘటన మంగళవారం రాత్రి సూరంపాలెంలో ఏడీబీరోడ్డు వద్ద జరిగింది. గండేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగ్గంపేటకు చెందిన ఆలపాటి రాజేష్(22) జగ్గంపేట నుంచి మోటార్సైకిల్పై పెద్దాపురం మీదుగా రామేశంపేట వైపు వచ్చేసరికి సూరంపాలెం గ్రామశివారున ఏడీబీ రోడ్డుపై ఎదురుగా బోలెరో వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రాజేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.