గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం
ABN , Publish Date - Apr 19 , 2024 | 01:28 AM
పెద్దాపురం - రా జమహేంద్రవరం ఏడీబీ రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకు లు దుర్మరణం పాలుకాగా మరో యువకుడు తీవ్ర గాయాలపాలైన ఘటన గురువారం రాత్రి జరిగింది.
పెద్దాపురం, ఏప్రిల్ 18: పెద్దాపురం - రా జమహేంద్రవరం ఏడీబీ రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకు లు దుర్మరణం పాలుకాగా మరో యువకుడు తీవ్ర గాయాలపాలైన ఘటన గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. అనకాపల్లికి చెందిన లాలం సతీష్(20), విశాఖపట్టణానికి చెంది న బర్రి మాధవ్కుమార్(19), శ్రీకాకుళం జిల్లా చిగురువలసకు చెందిన మరో స్నేహి తుడు రామచంద్రరావు ముగ్గురూ కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి వచ్చారు. తిరిగి మోటార్సైకిల్పై రూమ్కు వెళ్తుండగా వారి ని మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్ట డంతో మాధవ్, సతీ ష్ ఇద్దరు యువకులు అక్కడికక్కడే కిందపడి మృతి చెందగా మరో యువకుడు నక్కా రామచంద్ర రావు తీవ్ర గాయాలపా లయ్యాడు. బైక్ను ఢీకొట్టిన వాహనం సంఘటనా స్థలంనుంచి ఆగకుండా వెళ్లిపోయింది. మృ తిచెందిన యువకులు రామే శంపేటలో గది అద్దెకు తీసు కుని చదువుకుంటున్నారు. మృతిచెందిన యువకులు ఇం జనీరింగ్ చదువుతున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఢీకొట్టిన వాహనం వివరాల కోసం విచారణ చేపట్టారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృత దేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు