Share News

బొలెరో ఢీకొని ఇద్దరు యువకుల మృతి

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:10 AM

బొలెరో వ్యాన్‌ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. కిర్లంపూడి ఎస్‌ఐ జబీన్‌ తెలిపిన వివరాలు ప్రకారం...

బొలెరో ఢీకొని ఇద్దరు యువకుల మృతి

కిర్లంపూడి, మార్చి17: బొలెరో వ్యాన్‌ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. కిర్లంపూడి ఎస్‌ఐ జబీన్‌ తెలిపిన వివరాలు ప్రకారం... ఆదివారం సామర్లకోట నుంచి కిర్లంపూడికి బైక్‌పై కిర్లంపూడి రమణయ్యపేటకు చెందిన వార్డు మెంబర్‌ ముత్తా పెదకాపు రెండో కుమారుడు హరిసాయివెంకటఅప్పారావు(20), జగపతినగరం కొత్తపేటకు చెందిన పొలిమేరు వెంకటేష్‌(20) వస్తున్నారు. వారు రాజుపాలెం వచ్చేసరికి బొలెరా వ్యాన్‌ ఢీకొట్టడంతో వెంకటేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. హరిసాయిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జబీర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు యువకులు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించి ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:10 AM