Share News

కేక్‌ తేవడానికి వెళ్లి.. యువకుడి మృతి

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:19 AM

కేక్‌ తీసుకురావడానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

కేక్‌ తేవడానికి వెళ్లి.. యువకుడి మృతి
గోక ఏసురాజు

గోకవరం, డిసెంబరు 31 : కేక్‌ తీసుకురావడానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గోకవరం మండలం అచ్యుతాపురానికి చెందిన గోక ఏసురాజు(29) తాపీపనికి వెళుతుంటాడు.నూతన సం వత్సరం వేడుకల నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి స్నేహితులతో ఆనందంగా గడిపాడు. నూతన సంవత్సరంలో కేక్‌ కట్‌ చేద్దామని తెచ్చేందుకు రాత్రి 10 గంటల సమయంలో కొరుకోండ వెళ్లాడు. తిరుగుప్రయాణంలో గుమ్మళ్ల దొడ్డి వద్ద పోలీసులు బ్లాక్‌స్పాట్‌ గుర్తించి ఏర్పాటు చేసిన డ్రమ్మును బైక్‌తో ఢీకొని అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అం దుకున్న స్నేహితులు మృతదేహం వద్దకు చేరుకుని బోరున విలపించారు. ఏసు రాజు మృతితో అచ్యుతాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Jan 01 , 2024 | 12:19 AM