Share News

రైస్‌ మిల్లర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీనారాయణ

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:27 AM

రైస్‌ మిల్లర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీనారాయణ

  రైస్‌ మిల్లర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీనారాయణ

మండపేట/ఉప్పలగుప్తం, డిసెంబరు 31: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రైస్‌మిల్లర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా భీమనపల్లి శ్రీమల్లికా రైస్‌ ఇండస్ట్రీస్‌ అధినేత దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఆదివారం మండపేటలో జరిగిన కార్యక్రమంలో జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అధ్యక్షుడు వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి ఆధ్వర్యంలో ఈనియామకం జరిగింది. గతంలో లక్ష్మీనారాయణ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ద్వారంపూడి భాస్కరరెడ్డి, రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఆయనను అభినందించారు. ఆయననుజిల్లాకు చెందిన రైస్‌మిల్లర్ల సంఘ నాయకులు అభినందించారు. జిల్లా ఉపాధ్యక్షుడు గణేశుల కొండలరావు, వెత్స సూర్యప్ర కాష్‌, కోనగళ్ల సత్తిపండు, వైట్ల దుర్గారావు, ఎన్‌.వీ.వీఎస్‌.ఎస్‌. ఎన్‌.రెడ్డి, కర్రి నారాయణ రెడ్డి, సత్తి సత్తిరెడ్డి, నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి, నల్లమిల్లి విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 12:27 AM