జీజీహెచ్లో రెడ్క్రాస్ ఐ బ్యాంక్ ప్రారంభం
ABN , Publish Date - Jun 08 , 2024 | 12:17 AM
జీజీహెచ్ (కాకినాడ) జూన్ 7: జీజీహెచ్ ప్రాంగణంలో రెడ్క్రాస్ సంస్థ ఆధ్వ ర్యంలో నడిచే ఐ బ్యాంక్ను ఆసుపత్రి సూపరిండెంట్ డా.ఎస్.లావణ్యకుమారి రెడ్క్రాస్ చైర్మెన్ వైడి రామారావుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. సూపరిండెం ట్ మాట్లాడుతూ ఒకరి నేత్రదానంతో ఇద్ద రి అంధులకు చూపును ప్రసాదించవ
![జీజీహెచ్లో రెడ్క్రాస్ ఐ బ్యాంక్ ప్రారంభం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
జీజీహెచ్ (కాకినాడ) జూన్ 7: జీజీహెచ్ ప్రాంగణంలో రెడ్క్రాస్ సంస్థ ఆధ్వ ర్యంలో నడిచే ఐ బ్యాంక్ను ఆసుపత్రి సూపరిండెంట్ డా.ఎస్.లావణ్యకుమారి రెడ్క్రాస్ చైర్మెన్ వైడి రామారావుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. సూపరిండెం ట్ మాట్లాడుతూ ఒకరి నేత్రదానంతో ఇద్ద రి అంధులకు చూపును ప్రసాదించవచ్చ ని, దేశంలో 10 లక్షల మంది అంధులు కా ర్నియాల కోసం ఎదురుచూస్తూన్నారని వారికి నేత్రదానం చేయడం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రజలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. నేత్రదానంపై అవగాహన కల్పించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆప్తమాలజీ హెచ్వోడి డా.రమాభారతి, జిల్లా అంధత్వ నివారణా సొసైటీ పథక సంచాలకులు డా.పడాల ప్రసాద్, డా.ఎస్విరావ్, రెడ్క్రాస్ కార్యదర్శి కె.శివకుమార్ పాల్గొన్నారు.