రత్నగిరిపై రఽథసప్తమి వేడుకలు
ABN , Publish Date - Feb 17 , 2024 | 01:08 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో శుక్రవారం రఽథసప్తమి పర్వదినం పురస్కరించుకుని పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![రత్నగిరిపై రఽథసప్తమి వేడుకలు](https://media.andhrajyothy.com/media/2024/20240215/anv_818d44ecee.jpg)
అన్నవరం, ఫిబ్రవరి 16: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో శుక్రవారం రఽథసప్తమి పర్వదినం పురస్కరించుకుని పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పంచాయతనాల్లో ఒకరైన సూర్యభగవానుడికి ముందుగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించి నూతన పట్టువస్త్రాలను ధరింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్షిక కల్యాణ వేదికపై రుత్విక్లు సూర్యనమస్కారములు, సూర్యభగవానుడికి అష్టోత్తర శతనామ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకస్వాములు ఆవుపిడకల మంటపై క్షీరాన్నం వండి స్వామికి నివేదించి భక్తులకు తీర్థప్రసాదాలుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో రామచంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.