Share News

రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:14 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 7: పిఠాపురంలో రెవెన్యూ, పోలీసు అధికారులు రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అగ్రహారంలో సీఎంసీ ఆసుపత్రి సమీపంలోని ఒక ఇంటిలో రేషన్‌ బియ్యం నిల్వ చేసినట్లు అందిన సమాచారం మేరకు సివిల్‌ సప్లైస్‌ డిప్యూటీ తహశీల్దార్‌ మర్రి వీరాస్వామి, అడిషనల్‌ ఎస్‌ఐ వెంకట్‌ తనిఖీలు నిర్వ

రేషన్‌ బియ్యం స్వాధీనం

పిఠాపురం, ఏప్రిల్‌ 7: పిఠాపురంలో రెవెన్యూ, పోలీసు అధికారులు రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అగ్రహారంలో సీఎంసీ ఆసుపత్రి సమీపంలోని ఒక ఇంటిలో రేషన్‌ బియ్యం నిల్వ చేసినట్లు అందిన సమాచారం మేరకు సివిల్‌ సప్లైస్‌ డిప్యూటీ తహశీల్దార్‌ మర్రి వీరాస్వామి, అడిషనల్‌ ఎస్‌ఐ వెంకట్‌ తనిఖీలు నిర్వహించారు. 9 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడు గ్రామానికి చెందిన కర్రి చక్రబాబు ఈ బియ్యాన్ని నిల్వ చేసినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - Apr 08 , 2024 | 12:14 AM