Share News

రజకుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:37 AM

రజకుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం ద్వారా వారిని ఆదుకోవడమే అందుకు నిదర్శనమని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు.

రజకుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

] రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 7: రజకుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం ద్వారా వారిని ఆదుకోవడమే అందుకు నిదర్శనమని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. ఇటీవల జరిగిన రాజమహేంద్రవరం రజక సేవా సంఘం ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ రజక సాధికార కమిటీ రాజమండ్రి పార్లమెంట్‌ కన్వీనర్‌ బొమ్మదేవర శ్రీనివాస్‌, ఆయన ప్యానల్‌ సభ్యులకు ఆదివారం తిలక్‌రోడ్డులోని పార్టీ సిటీ నియోజకవర్గ కార్యాలయంలో అభినందన సత్కారం నిర్వహించారు. రజకులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత రజకుల సంక్షేమానికి కృషి చేస్తామని శ్రీనివాస్‌ అన్నారు. కార్యక్రమంలో మల్లెల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:37 AM