జగ్గంపేట, గండేపల్లిలో తీవ్రంగా తాగునీటి సమస్య
ABN , Publish Date - May 26 , 2024 | 11:10 PM
జగ్గంపేట, మే 26: జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని రైతు కూలీ సంఘం నేత కర్నాకుల వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గంపేటలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన అధికా రులు రాజకీయ
![జగ్గంపేట, గండేపల్లిలో తీవ్రంగా తాగునీటి సమస్య](https://media.andhrajyothy.com/media/2024/20240511/26_Jpt7_b5342aa645.gif)
రైతు కూలీ సంఘం నేత కర్నాకుల
జగ్గంపేట, మే 26: జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని రైతు కూలీ సంఘం నేత కర్నాకుల వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గంపేటలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన అధికా రులు రాజకీయ నేతల కనుసన్నల్లో పనిచేస్తు న్నారని మండిపడ్డారు. ఈ 2 మండాల్లో ఉన్న గ్రామాలకు శుద్ధిచేసిన నీటి సరఫరా చేయడా నికి భావారంలో కోట్లాది రూపాయులు వెచ్చిం చి ఫిల్డర్ బెడ్లు, ట్యాంక్ నిర్మించారన్నారు. అ యినా అధికారులు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడం లేదని విమర్శించారు. తాగునీరు లేక పోవడంతో సుద్ద నీటిని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. వీధి కుళాయి ద్వా రా 2, 3 రోజులకు ఒకసారి నీటిని విడుదల చే స్తున్నారన్నారు. భావారంలో నీటిని ఒక భూ స్వామి తన పామాయిల్ తోటలకు తరలిం చుకుంటున్నాడని, దీనిపై జిల్లా అధికారులు వి చారణ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నేతలు రాజబాబు, సతీష్, అంజి బాబు, రామలింగేశ్వరరావు,సురేష్ పాల్గొన్నారు.