పీవీఆర్ పాఠశాల పునఃప్రారంభం కోరుతూ బంద్
ABN , Publish Date - Feb 01 , 2024 | 01:04 AM
పీవీఆర్ పాఠశాల పునఃప్రారంభం కోరుతూ బంద్
![పీవీఆర్ పాఠశాల పునఃప్రారంభం కోరుతూ బంద్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ద్రాక్షారామ, జనవరి 31: ద్రాక్షారామలో పీవీఆర్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల పున:ప్రారంభించాలని కోరుతూ యాజమన్యం వైఖరి నిరసిస్తూ పాఠశాల సాధన సమితి పిలుపుతో బుధవారం ద్రాక్షారామలో సంపూర్ణ బంద్ జరిగింది. వ్యాపారులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను సాధన సమితి నాయకులు బంద్ చేయించారు. ద్రాక్షారామ బోసుబొమ్మ సెంటర్లో సాధనసమితి నాయకులు దీక్ష చేపట్టారు. ఈఆందోళనకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం, రాయపురెడ్డి రాజా, డా. కాద వెంకటరమణ, జనసేన నాయకులు మద్దతు ప్రకటించారు. దీక్షలో సాధన సమితి నాయకుడు మాగాపు అమ్మిరాజు, ఉపసర్పంచ్ పెన్నాడ బుచ్చిరాజు, మాజీ ఉపసర్పంచ్ నామా వెంకన్నబాబు, కోటిపల్లి అబ్బు, వైసీపీ యువనేత తోట పృధ్వీరాజ్, జనసేన నాయకులు సంపత్ పాల్గొన్నారు.