ప్రజారోగ్య భద్రతకు ఎన్సీడీసీడీ 3.0 సర్వే
ABN , Publish Date - Dec 07 , 2024 | 01:34 AM
జిల్లా వ్యాప్తంగా ప్రజల ఆరోగ్య భద్రతకు వైద్య ఆరోగ్యశాఖ ఎన్సీడీసీడీ 3.0 సర్వే నిర్వహిస్తోం దని డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ జె.సం ధ్య అన్నారు. శుక్రవారం నిడదవోలులోని నెహ్రూ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(యూపీహెచ్సీ)ని ఆమె పరిశీలించారు.
డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ సంధ్య
నిడదవోలు, డిసెంబరు 06 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ప్రజల ఆరోగ్య భద్రతకు వైద్య ఆరోగ్యశాఖ ఎన్సీడీసీడీ 3.0 సర్వే నిర్వహిస్తోం దని డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ జె.సం ధ్య అన్నారు. శుక్రవారం నిడదవోలులోని నెహ్రూ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(యూపీహెచ్సీ)ని ఆమె పరిశీలించారు. అనంతరం ఇంటింటా జరుగుతున్న సర్వే తీరుతెన్నులను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంధ్య మాట్లాడుతూ ఈ సర్వే ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు వివిధ రకాల ఆరోగ్య పరిక్షలు నిర్వహించి ఏదైఆ సమస్య ఉంటే ముందుగానే గుర్తించి దానికి వైద్య సేవలందించడమని అన్నారు. నెహ్రూనగర్ యూపీహెచ్సీ పరిధిలో ఇంటింటా సర్వే వేగవం తంగా సాగుతుందని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తేజశ్రీ, వైద్య సిబ్బంది ఉన్నారు.