‘వైసీపీ దళిత ద్రోహుల పార్టీ’
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:26 AM
ప్రత్తిపాడు, ఏప్రిల్ 17: వైసీపీ దళిత ద్రోహుల పార్టీ అని ప్రత్తిపాడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా విమర్శించారు. బుధవారం స్థానిక
ప్రత్తిపాడు, ఏప్రిల్ 17: వైసీపీ దళిత ద్రోహుల పార్టీ అని ప్రత్తిపాడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా విమర్శించారు. బుధవారం స్థానిక విలేకర్లతో ఆమె మాట్లాడుతూ వైసీపీలో దళితులను అవమానించి, హింసించిన తోట త్రిమూర్తులు, అనంతబాబులకు ఆశ్రయం ఇవ్వడం ఆ పార్టీ దళితుల ద్రోహి పార్టీ అనడానికి ఉదాహరణ అన్నారు. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులను కోర్టు దోషిగా తేల్చిందన్నారు. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్యచేసి బెయిల్పై తిరుగుతున్న అనంతబాబుకు వైసీపీ అండగా నిలిచిందన్నారు. ఇప్పటి వరకు 6035 మంది దళితులపై వైసీపీ ప్రభుత్వంలో దాడులు జరిగాయన్నారు. దళితులకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ యేనని జరగబోయే ఎన్నికల్లో అధికారం సాధించి కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉంటుందని సత్యప్రభ తెలిపారు.